- Neti Charithra
Breaking..శ్రీశైలం వెళుతున్న వాహనం.. బోల్తా.. లోయలో పడ్డ తొమ్మిది మంది భక్తులు..ఇద్దరు మృతి!
Breaking.. శ్రీశైలం వెళుతున్న వాహనం.. బోల్తా.. లోయలో పడ్డ తొమ్మిది మంది భక్తులు..ఇద్దరు మృతి!
శ్రీశైలం: నేటి చరిత్ర
శ్రీశైలం ఘాట్రోడ్డులో మంగళవారం రాత్రి
ఘోరరోడ్డు ప్రమాదం లో ఇద్దరు భక్తులు మృతి చెందారు. అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో మూల మలుపు వద్ద రక్షణ గోడను వ్యాను ఢీకొని 20 అడుగుల లోయలో పడిపోయింది.
ఘటన జరిగిన సమయంలో అందులో 9 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరు మృతి చెందారు..క్షతగాత్రులను ఈగలపెంట జెన్కో ఆస్పత్రికి తరలించారు
. హైదరాబాద్ దూల్పేటకు చెందిన కొంతమంది భక్తులు శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి ఈగలపెంట ఎస్సై పోచయ్య చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
190 views0 comments