- Neti Charithra
Breaking.. శశికళ కు భారీ షాక్..2 వేల కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ప్రభుత్వం!
Breaking.. శశికళ కు భారీ షాక్..2 వేల కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ప్రభుత్వం!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళకు బుధవారం ఐటి శాఖ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న
శశికళకు చెందిన రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయ పన్ను అధికారులు బినామీ నిరోధక చట్టం కింద స్తంభింపజేశారు. చెన్నై పోయెస్ గార్డెన్లో జయలలిత నివాసగృహానికి
ఎదురుగా స్థలాన్ని కొనుగోలు చేసి, జయ నివాసానికి దీటుగా శశికళ భవన నిర్మాణం చేపట్టారు. రూ.300 కోట్ల విలువైన స్థలంతోపాటు మరో రెండు ఆస్తులు ఇందులో ఉన్నాయి. సిరుతవుర్, కొడనాడు ప్రాంతాల్లోని ఈ ఆస్తులు జయలలిత సన్నిహితురాలు శశికళ, ఇలవరసి, సుధాకరన్ల పేరు మీద ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. స్తంభింపజేసిన ఆస్తులకు ఆదాయపన్ను శాఖకు చెందిన బినామీ నిరోధక విభాగం అధికారులు నోటీసులు అతికించారు. అక్రమాస్తుల
కేసులో బెంగళూరు పర్పప్పన అగ్రహార జైలులో శశికళ ఉన్న విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసి వచ్చే ఏడాది జనవరిలో ఆమె విడుదల కానున్నట్టు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. కాగా షెల్ కంపెనీలతో శశికళ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు ఆస్తులను అటాచ్ చేశారు.