- Neti Charithra
Breaking.. చంద్రబాబు... కుట్రలు చేస్తున్నారు- అసెంబ్లీ లో సీఎం జగన్..!
Breaking.. చంద్రబాబు... కుట్రలు చేస్తున్నారు- అసెంబ్లీ లో సీఎం జగన్..!
వెలగపూడి:నేటి చరిత్ర
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండోరోజు మంగళవారం వేడి వేడిగా కొనసాగుతున్నాయి.ప్రతి పక్షాల అభ్యంతరాలు మధ్య సీఎం జగన్ ఖటుగా స్పందించారు. శాసనమండలి ముందుకు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ చట్టం 2020 రానుంది. 10 బిల్లులను ఎపి ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చ జరగాల్సి ఉంది.టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని టిడిపి డిమాండ్ చేస్తోంది. హౌసింగ్పై చర్చకు టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించడంతో టిడిపి నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై చర్చించాలని ఇప్పటికే సర్కారు అజెండాలో పెట్టడంతో వాయిదా తీర్మానాన్ని
తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.వైఎస్ జగన్ మాట్లాడుతూ... తాను ఏదైనా మాట చెబితే ఆ మాటను నిలబెట్టుకుంటానని, ప్రజల్లో విశ్వాసం ఉందని చెప్పారు. చంద్రబాబు
నాయుడికి మాత్రం మోసం చేయడమే తెలుసని విమర్శించారు. సభలో బిల్లులపై చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారని జగన్ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. డిసెంబరు 25 న ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని సిఎం
జగన్ మోహన్ రెడ్డిప్రకటించారు.
కాగ సభా సమావేశాలకు అడ్డపడుతున్న మరో టీడీపీ ఎమ్మెల్యే రామ నాయుడు
ను స్పీకర్ సస్పెండ్ చేశారు.