- Neti Charithra
Breaking..ప్రేమోన్మాదుల ల..కిరాతకం ..బ్యాంక్ మహిళా ఉద్యోగిని ని హత్య చేసి..పెట్రోల్ పోసి..దారుణ హత్య
Breaking... ప్రేమోన్మాదుల ల.. కిరాతకం
.. బ్యాంక్ మహిళా ఉద్యోగిని ని హత్య చేసి.. పెట్రోల్ పోసి..దారుణ హత్య..!
నేటి చరిత్ర: ( ప్రత్యేక ప్రతిని థి)
ప్రేమ పేరుతో.. ఓ యువతిని వేధించి..చివరికి యువతిని హత్య చేసి .. పెట్రోల్ పోసి నిప్పంటించి న ఘటన అనంతపురం జిల్లా ధర్మ వరం లో కల కలం రేపింది. ఈ ఘటన కు సంబంధించిన వివరాలుఉన్నాయి.ధర్మవరానికి చెందిన స్నేహలత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కాంట్రాక్టు ఉద్యోగిగా
పనిచేస్తోంది. రోజులాగే మంగళవారం ఉదయం బ్యాంక్కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో స్నేహలత తల్లిదండ్రులు అనంతపురం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, బుధవారం తెల్లవారుజామున ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద స్నేహలత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాజేష్, కార్తీక్ అనే యువకులే తమ కుమార్తెను హత్య చేశారని స్నేహలత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చాలా కాలంగా ఈ ఇద్దరు ప్రేమ పేరుతో తమ కూతురిని వేధించారని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ధర్మవరం పోలీసులు విచారణ చేపట్టారు. తాజా ఘటన జిల్లా లో సంచలనం కలిగించింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.