- Neti Charithra
Breaking.. తిరుపతి లో నేల కూలిన గరుడ వారధి.. నిర్మాణ పనులు..నిరసన కు దిగిన ప్రతి పక్షాలు..!
Breaking.. తిరుపతి లో నేల కూలిన గరుడ వారధి.. నిర్మాణ పనులు..నిరసన కు దిగిన ప్రతి పక్షాలు..!
చిత్తూరు జిల్లా తిరుపతి లో గరుడ వారధి పనుల్లో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది.శ్రీ నివాసం వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోయింది. అయితే, ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం లో ప్రాణ నష్టం తప్పింది. ఘటనా స్థలాన్ని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, నగర కమిషనర్ గిరీష్ లతో పాటు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లు పరిశీలించారు. కాగ గరుడ వారధి కూలడం తో టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతలు నిరసనకు దిగారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
274 views0 comments