- Neti Charithra
Breaking.. టీడీపీ లో విషాదం.. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత..!
Breaking.. టీడీపీ లో విషాదం.. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత..!
చిత్తూరు: నేటి చరిత్ర
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె సత్యప్రభ కన్నుమూశారు. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గుండెపోటుకు గురై ఆమె తుదిశ్వాస
విడిచారు. ఇటీవలే ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. కాగా చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన ఆమె
టిడిపి మాజీ ఛైర్మన్ డికె ఆదికేశవులు నాయుడు సతీమణి అయిన సత్యప్రభ.. ఆయన మృతితో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత
2019 ఎన్నికల్లో రాజంపేట అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే సత్యప్రభ టిడిపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికయ్యారు. సత్యప్రభ మరణం టిడిపికి లోటు అని ఆ పార్టీ
పలువురునేతలు విచారం వ్యక్తం చేశారు. సత్యప్రభ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.కాగ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు,మాజీ మంత్రి నారా లోకేష్ తదితరులు ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.