- Neti Charithra
Breaking.. జాతీయ రహదారి పై.. మరో భారీ చోరీ..45 నిముషాల్లోరూ.2 కోట్ల ఖరీదైన సెల్ ఫోన్ లు మాయం..!
Breaking.. జాతీయ రహదారి పై.. మరో భారీ చోరీ..45 నిముషాల్లో రూ.2 కోట్ల ఖరీదైన సెల్ ఫోన్ లు మాయం..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
జాతీయ రహదారులలో పెద్దఎత్తున చోరీలు
చోటుచేసుకుంటున్నాయి. దింతో పలు సంస్థలు.. కంపెనీలు బెంబేలు ఎత్తుతున్నాయి. ఇటీవల ఏపీ లో రెండు
దారిదోపిడీ లలో కోట్ల ఖరీదు ఆయిన సెల్ ఫోన్ లు మాయం అయ్యాయి. తాజాగా
తెలంగాణా లో మరో రూ.2 కోట్ల విలువైన సెల్ ఫోన్ లు అపహరించిన ఘటన ఈనెల 16న మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగింది. దింతో
కంపెనీ ప్రతినిధులు మంగళవారం చేగుంట ఠాణాలో ఫిర్యాదు చేశారు. చేగుంట ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన వివరాలు.. ఈనెల 15న చెన్నై నుంచి దిల్లీకి రెడ్మీ కంపెనీకి చెందిన రూ.11 కోట్ల విలువైన సెల్ఫోన్లను తీసుకుని కంటైనర్ బయలుదేరింది. కంటైనర్ డ్రైవర్ దేవేందర్ 16వ తేదీ రాత్రి 44వ జాతీయ రహదారిపై మాసాయిపేట వద్ద 45 నిమిషాల పాటు ఆపాడు. కంటైనర్లో సెల్ఫోన్లు తీసుకెళుతున్న విషయం ముందే తెలుసుకున్న దుండగులు అవకాశం కోసం కాచుకుని ఉండి ఇక్కడ అపహరించారు. కంటైనర్లో సెల్ఫోన్లు చోరీ అయిన విషయాన్ని గుర్తించని డ్రైవర్ అక్కడి నుంచి దిల్లీ బయలుదేరాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వద్దకు వెళ్లిన తర్వాత అనుమానం వచ్చిన డ్రైవర్ కంటైనర్ను ఆపి చూడగా తాళాలు తీసి ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ విషయాన్ని సెల్ఫోన్ల కంపెనీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చాడు. వారు విషయాన్ని దిల్లీలో ఉన్న వారికి చెప్పగా హుటాహుటిన అక్కడ నుంచి వచ్చిన ప్రతినిధి కంటైనర్ను
పరిశీలించగా అందులో 2200 సెల్ఫోన్లు అపహరణకు గురయినట్లు గుర్తించారు. వాటి విలువ రూ.2 కోట్లుగా నిర్ధారించి జీపీఎస్ ఆధారంగా కంటైనర్ మాసాయిపేట వద్ద 45 నిమిషాల పాటు ఆగినట్లు గుర్తించారు. ఇందుకు ఆరు రోజులు పట్టగా మాసాయిపేట వద్ద చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని మంగళవారం చేగుంట ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.