- Neti Charithra
Breaking.. చిత్తూరు జిల్లా లో నాటు తుపాకి..కాల్పులు..ఒకరి పరిస్థితి విషమం..!
Breaking.. చిత్తూరు జిల్లా లో నాటు తుపాకి..కాల్పులు..ఒకరి పరిస్థితి విషమం..!
శాంతిపురం: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా లో నాటు తుపాకి కాల్పులు కల కలం రేపాయి..ఈ ఘటన పై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. శాంతిపురం మండలంలో నాటుతుపాకీ పేలి బాలుడికి గాయాల య్యాయి. శాంతిపురం మండలం
సోలిశెట్టిపల్లిలో పందులను వేటాడేందుకు గాను ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో గురితప్పి అక్కడే ఉన్న బాలుడికి తూటాలు తగిలాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని వెల్లూరు సీఎంసీ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
236 views0 comments