- Neti Charithra
Breaking..అక్రమ కేసులతో వేధిస్తున్నారని..పోలీసుల ఎదుటే..ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డటీడీపీ కార్యకర్త
Breaking..అక్రమ కేసులతో
వేధిస్తున్నారని..పోలీసుల ఎదుటే..ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్త!
అనంతపురం: నేటి చరిత్ర
పోలీసులు తమ కుటుంబ సభ్యుల ను
వేధిస్తున్నారని ఓ టీడీపీ కార్యకర్త ఆత్మహత్య యత్నానికి పడి న ఘటన కల కలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లాలోని సోమందేపల్లిలో టీడీపీ కార్యకర్త కాలాచారి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వైసీపీ నేతల ప్రోద్భలంతో కుటుంబ సభ్యులను పోలీసులు కేసుల పేరుతో తరచుగా
వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కొద్ది రోజుల క్రితం తన సోదరుడిపై అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపారని కాలాచారి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో పోలీసుల ఎదుట
ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న కాలాచారిని పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు.
287 views0 comments