- Neti Charithra
ఉద్యోగ, ఉపాధ్యాయులకు.. పెద్ద గుడ్ న్యూస్ చెప్పిన.. జగన్ సర్కార్..!
ఉద్యోగ, ఉపాధ్యాయులకు.. పెద్ద గుడ్ న్యూస్ చెప్పిన.. జగన్ సర్కార్..!
అమరావతి: నేటి చరిత్ర
ఏపీ లో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు అందించింది.
కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు ఉద్యమ కేసుల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
విముక్తి కల్పించింది. ఉద్యమం సమయంలో వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖను ప్రభుత్వం ఆదేశించింది. సీపీఎస్ను రద్దు చేయాలని కోరుతూ గతంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలు చేశారు
. ఈ క్రమంలో కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులనే ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది. ఈ నిర్ణయం తో ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తం అయ్యింది.
680 views0 comments