- Neti Charithra
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!
అమరావతి :నేటి చరిత్ర
ఆంధ్రప్రదేశ్ కుఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల కు జగన్ సర్కార్ తీపి కబురు అందించింది.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిఅనుమతి నిబంధనల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సడలింపులు చేసింది. అన్లాక్ 3 నిబంధనల మేరకు వీటిని సడలించినట్లు
అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆటోమెటిక్ ఈపాస్ జారీకి నిర్ణయించారు. స్పందన వెబ్సైట్లో పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈపాస్ జారీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రయాణికుడి మొబైల్, ఈమెయిల్కు పాస్
పంపనున్నారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఈపాస్తోపాటు గుర్తింపు కార్డు చూపించి రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చని ప్రభుత్వం తెలిపింది. రేపటి నుంచి ఆటోమేటిక్ ఈపాసులు జారీ చేయనున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. చెక్పోస్టుల వద్ద నమోదు చేసుకున్నవారి వివరాలను స్థానిక సిబ్బందికి ఇస్తామని చెప్పారు.