- Neti Charithra
ఆంధ్రప్రదేశ్ లో పెళ్లిళ్లకు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ముహుర్తాలు .. కు పరుగులు !

ఆంధ్రప్రదేశ్ లో పెళ్లిళ్లకు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ముహుర్తాలు కు పరుగులు !
అమరావతి: నేటి చరిత్ర
ఆంధ్రప్రదేశ్ లో పెళ్లిళ్లు చేసుకునేందుకు
ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్ డౌన్ తో సుమారు 42 రోజులుగా పెళ్ళిళ్ళు.. తంతు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు పెళ్లిళ్ళు చేసుకునే జంటలకు తీపి కబురు వచ్చింది.లాక్డౌన్ అమల్లో ఉన్నందున వివాహాలు జరుపుకునేవారు సంబంధిత సబ్కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో అనుమతి కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం
సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
డివిజనల్ కార్యాలయాల్లోనే వీటికి అనుమతులు జారీ చేస్తారని తెలిపారు.

328 views0 comments