- Neti Charithra
ఆర్టీసీ ఉద్యోగులకు 670 మందికి..కరోనా..!ఉద్యోగుల లో భయం..భయం..!
ఆర్టీసీ ఉద్యోగులకు 670 మందికి..కరోనా..!ఉద్యోగుల లో భయం..భయం..!
అమరావతి: నేటి చరిత్ర
ఏపీ లో ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా వేధిస్తోంఫై.రాష్ట్ర వ్యాప్తంగా
ఆర్టీసీ సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. తొలుత రోజుకు సగటున 5-10 మందికి పాజిటివ్ వచ్చినట్లు
గుర్తించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 60-70కి చేరింది. ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 670 మంది ఆర్టీసీ సిబ్బందికి వైరస్ సోకింది. అత్యధికంగా కడప జోన్లో 260 మంది వరకు కొవిడ్ బారినపడ్డారు. ఆదివారం
ఒక్కరోజే 71 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ కాగా.. ఇందులో 31 మంది కడప జోన్వారే. కొవిడ్ బారినపడి ఇప్పటి వరకు 10 మంది ఆర్టీసీ సిబ్బంది చనిపోయారు.
532 views0 comments